Breaking News

సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నూతన కార్యాలయం ప్రారంభం.

ముషీరాబాద్ ఏప్రిల్ 27(నేటి తెలుగు పత్రిక): సీతాఫల్మండి సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. అంబాల రాజేశ్వరరావు అధ్యక్షతన సోమవారం సీతాఫల్మండిలో జరిగిన కార్యాలయ ప్రారంభోత్సవానికి గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చాంద్ పాషా, సెంట్రల్ కమిటీ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ శ్యామల హేమ, బిజెపి జిల్లా అధ్యక్షులు భరత్ గౌడ్, మేకల సారంగపాణి, కృష్ణమూర్తి, హరి హాజరై కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. అనంతరం సీతాఫల్మండి జోన్ సభ్యులు నర్సింగరావు, లక్ష్మీనరసింహులు, రవి, శ్రీనివాస్, యాదగిరి, హుస్సేన్, వెంకటేష్, లక్ష్మణ్ ,సంపత్ మాట్లాడుతూ అతి తక్కువ రేట్లతో సెంట్రింగ్ పనులు చేయలేకపోతున్నామని సెంట్రింగ్ రేట్స్ పెంచాలని డిమాండ్ చేశారు. అంబాల రాజేశ్వరరావు మాట్లాడుతూ సీతాఫల్మండి సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించుకున్నామని త్వరలోనే పూర్తిస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *