Breaking News

తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ కొరత సమస్య మూడోరోజుకూ కొనసాగుతూ వాహనదారులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. పలు ప్రాంతాల్లో డీజిల్ కొరత మరింత తీవ్రమైందని తెలుస్తోంది.ప్రభుత్వం, పౌరసరఫరాల శాఖ తగినన్ని నిల్వలు ఉన్నాయని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. చాలా చోట్ల పెట్రోల్ బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి.ఇంధనం కోసం వాహనదారులు బంకుల ముందు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. పెట్రోల్, డీజిల్ సరఫరాలో జాప్యం జరుగుతోందని డీలర్లు చెబుతున్నారు. సరఫరా ఆలస్యం కారణంగా నిల్వలు ఖాళీ కావడంతోనే ‘నో స్టాక్’ బోర్డులు పెట్టాల్సి వస్తోందని వెల్లడిస్తున్నారు.ఈ పరిస్థితిపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుండగా, సరఫరా వ్యవస్థను సక్రమంగా నిర్వహించాలని ప్రభుత్వంపై డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

విశాఖలో గూగుల్‌ డేటా సెంటర్‌.. ఏపీకి గేమ్‌ చేంజర్: సీఎం చంద్రబాబు

42% బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి: ఆర్. కృష్ణయ్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *