ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం ఇకపై గ్లోబల్ ఏఐ హబ్గా రూపాంతరం చెందబోతోందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ విజన్లో భాగంగానే గూగుల్ క్లౌడ్ డేటా సెంటర్ ఏర్పాటు జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు చాలా తక్కువ సమయంలో శంకుస్థాపన దశకు చేరుకుందని, రికార్డ్ టైమ్లో నిర్మాణం పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రపంచ ఐటీ రంగంలో భారత్ ఇప్పటికే ముందంజలో ఉందని, విశ్వసనీయ భాగస్వామిగా గుర్తింపు పొందిందని చెప్పారు.గూగుల్ క్లౌడ్ డేటా సెంటర్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ స్వయంగా హాజరవుతారని మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టుతో విశాఖపట్నం అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీ కేంద్రంగా ఎదగబోతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
