Breaking News

పహల్గామ్ తరహా సంఘటన.. మతం అడిగి మరీ కత్తిపోట్లు!

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): ముంబై శివార్లలో జరిగిన కత్తి దాడి ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మీరా రోడ్‌లోని నయా నగర్ ప్రాంతంలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై జరిగిన ఈ దాడిని పోలీసులు తీవ్రంగా పరిగణించి, కేసును ముంబై ATSకి అప్పగించారు.ఆదివారం తెల్లవారుజామున నిర్మాణంలో ఉన్న భవనం వద్ద విధుల్లో ఉన్న ఇద్దరు గార్డులపై నిందితుడు దాడికి పాల్పడ్డాడు. ముందుగా వారి వ్యక్తిగత వివరాలు అడిగి తెలుసుకుని, అనంతరం కత్తితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.నిందితుడు జుబేర్ అన్సారీని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. అతని వద్ద లభించిన లేఖలో తీవ్రవాద భావజాలానికి సంబంధించిన పదాలు ఉండటంతో కేసు మలుపు తిరిగింది. ఈ ఘటన వెనుక వ్యక్తిగత కారణాలా లేదా ఉగ్రవాద సంబంధాలున్నాయా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.ప్రస్తుతం నిందితుడి మొబైల్ డేటా, సోషల్ మీడియా కార్యకలాపాలను అధికారులు విశ్లేషిస్తున్నారు. ఎవరితోనైనా సంబంధాలు ఉన్నాయా, లేదా స్వయంగా ప్రభావితమై ఈ దాడికి పాల్పడ్డాడా అన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.ఈ ఘటన నేపథ్యంలో మీరా రోడ్ పరిసర ప్రాంతాల్లో భద్రతను పోలీసులు మరింత కట్టుదిట్టం చేశారు.

ఏబీఎన్ జర్నలిస్ట్ హత్య.. చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన

సిక్కిం పర్యటనలో మోదీ స్టైల్.. యువతతో ఫుట్‌బాల్ ఆడిన ప్రధాని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *