విజయవాడ. ఏప్రిల్ 28 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: యనమలకుదురు కొండ పై వెలసి ఉన్న రామలిం గేశ్వర స్వామి నీ సతి సమేతంగా దర్శించుకున్న కేశినేని చిన్ని దంపతులు.కృష్ణాజిల్లా పెనమలూరు విజయవాడ సమీపంలో ఉన్న ప్రముఖ ఆలయాల్లో ఒకటిగా పేరుగాంచి యన మలకుదురులో వెలసిన రామలింగేశ్వర స్వామిని విజయవాడ ఎంపీ కేశినే ని చిన్ని దంపతులు దర్శించుకోవడం జరిగింది.ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఎంపీ చిన్ని ఆయన సతీమణి జానకి లక్ష్మి కి ఘన స్వాగతం పలికారు. ఆలయ అధికా రులు సిబ్బంది మేళతాళా లతో స్వామివారిని దర్శిం చుకునే ఏర్పాట్లు చేశారు.ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ విజ యవాడ చుట్టుపక్కలే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి దర్శించుకునే అనేక ప్రధా న ఆలయాల్లో యనమల కుదురు శివాలయం కూడా ప్రత్యేకమైనదని తెలియజేశారు. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే మనసంతా ప్రశాంతంగా ఉంటుందని స్వామి అను గ్రహం ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు తన పార్లమెంటు పరిధిలో మరింత అభివృద్ధి జరగా లని ప్రజలు సుఖ సంతో షాలతో వర్ధిల్లాలని కోరా రు. ఈ కార్యక్రమంలో కేశినేని కుటుంబ సభ్యు లు, సన్ని హితులు, తదితరులు పాల్గొన్నారు.

