ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డి ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో, ఆయన స్థానంలో ఆనంద్ బాధ్యతలు చేపట్టనున్నారు.ప్రస్తుతం హోంశాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న సీవీ ఆనంద్, మే 1వ తేదీ నుంచి అధికారికంగా డీజీపీగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. 1991 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన ఆయనకు విస్తృత అనుభవం ఉంది.ఇంతకు ముందు హైదరాబాద్, సైబరాబాద్, విజయవాడ నగరాల పోలీస్ కమిషనర్గా సేవలందించిన ఆనంద్, పరిపాలనలో తన ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఆయన నియామకంతో రాష్ట్ర పోలీస్ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
