Breaking News

జీవిత ఖైదీ నుంచి న్యాయవాదిగా పేరరివాళన్ కొత్త ప్రయాణం

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా శిక్ష అనుభవించిన ఎ.జి. పేరరివాళన్ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. దీర్ఘకాల జైలు జీవితం అనంతరం ఆయన ఇప్పుడు న్యాయవాదిగా మారి కొత్త ప్రయాణం మొదలుపెట్టారు.తమిళనాడు–పుదుచ్చేరి బార్ కౌన్సిల్‌లో తన పేరు నమోదు చేసుకున్న పేరరివాళన్, అధికారికంగా అడ్వకేట్‌గా మారారు. దాదాపు 31 ఏళ్లపాటు జైలు జీవితం గడిపిన ఆయన, 2022లో సుప్రీంకోర్టు ఉత్తర్వులతో విడుదలయ్యారు.విడుదల తర్వాత విద్యపై దృష్టి సారించిన ఆయన, బెంగళూరులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ లా కాలేజీలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించి డిగ్రీ పూర్తిచేశారు. అనంతరం 2025లో నిర్వహించిన ఆల్ ఇండియా బార్ పరీక్షలో ఉత్తీర్ణులై, త్వరలో మద్రాస్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించనున్నారు. మీడియాతో మాట్లాడిన పేరరివాళన్, జైళ్లలో సరైన న్యాయ సహాయం లేక ఇబ్బందులు పడుతున్న ఖైదీలకు సహాయం చేయడమే తన లక్ష్యమని తెలిపారు. ముఖ్యంగా నిరుపేద ఖైదీలకు న్యాయం అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు.1991లో తమిళనాడులోని శ్రీపెరంబదూర్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో రాజీవ్ గాంధీ మృతి చెందగా, ఈ కేసులో బాంబు తయారీకి అవసరమైన సామగ్రి సమకూర్చారనే ఆరోపణలతో యువకుడైనప్పుడే పేరరివాళన్ అరెస్టయ్యారు. 1998లో మరణశిక్ష విధించబడగా, 2014లో సుప్రీంకోర్టు దానిని జీవిత ఖైదుగా మార్చింది. అనంతరం క్షమాభిక్ష ప్రక్రియలో భాగంగా విడుదలకు మార్గం సుగమమై, 2022లో ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు.జైలు జీవితం నుంచి బయటపడి విద్యను పూర్తిచేసుకుని న్యాయవాదిగా మారడం ఆయన జీవితంలో కీలక మలుపుగా మారింది. ఇప్పుడు సమాజంలో న్యాయం అందని వర్గాలకు తోడ్పడాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.

గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్‌పై రాహుల్ విమర్శలు… ‘అభివృద్ధి కాదు, స్కామ్’ ఆరోపణ

పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలకు గడువు… స్వచ్ఛ ఇంధనాల వైపు దేశం: నితిన్ గడ్కరీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *