ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డిని ఎవరూ గుర్తు పెట్టుకోరన్న కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ ఘాటుగా స్పందించారు.‘డబ్బులు ఖర్చు చేసి అషు రెడ్డి వంటి వారితో కార్యక్రమాలు నిర్వహించడంతో, చేనేత బ్రాండ్ అంబాసిడర్గా రకుల్ ప్రీత్ సింగ్తో ర్యాంప్ వాక్ చేయించడంతోనే కొందరు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు’ అంటూ ఆయన విమర్శించారు.అయితే ప్రజల సమస్యల కోసం పోరాడిన నాయకుడిగా సీఎం రేవంత్ రెడ్డిని ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని చామల పేర్కొన్నారు. ప్రజల మద్దతుతోనే ఆయన అధికారంలోకి వచ్చారని, అదే ఆయనకు నిజమైన గుర్తింపని అన్నారు.ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో వాగ్వాదం మరింత వేడెక్కింది.
