ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ మీర్పేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అనుమానం కారణంగా భార్యను భర్త అత్యంత క్రూరంగా హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది.నల్గొండ జిల్లా శివన్నగూడెంకు చెందిన వసంత (52), నర్సింహ (60) దంపతులు జీవనోపాధి కోసం నగరానికి వచ్చి బీఎన్ రెడ్డి నగర్ సమీపంలో నివసిస్తున్నారు. ఈరోజు తెల్లవారుజామున నర్సింహ తన భార్య వసంతపై దాడి చేసి కత్తితో హతమార్చాడు.సమాచారం అందుకున్న వెంటనే మీర్పేట పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.
