ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): ఏపీ సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టుల కేసులో వైఎస్ జగన్ మాజీ CPRO పూడి శ్రీహరి మళ్లీ పోలీసుల అదుపులోకి వెళ్లారు. కుప్పం పోలీసులు బెంగళూరులో ఆయనను మరోసారి అదుపులోకి తీసుకున్నారు.ఇప్పటికే ఈ కేసులో శ్రీహరిని అరెస్ట్ చేసిన పోలీసులు, కుప్పం కోర్టులో హాజరుపరిచారు. అయితే రిమాండ్కు కోర్టు నిరాకరించడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. అనంతరం పోలీసులు హైకోర్టును ఆశ్రయించగా, అక్కడి ఉత్తర్వులు కూడా తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి.దీంతో శ్రీహరి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ వ్యవహారంలో హైకోర్టే తుది నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది.ఈ పరిణామాల నేపథ్యంలో కుప్పం పోలీసులు తదుపరి చట్టపరమైన చర్యలు చేపడుతూ, శ్రీహరిని మరోసారి అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
