ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా మంత్రి నారా లోకేశ్ బాధ్యతలు స్వీకరించారు.మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో లోకేశ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పార్టీని మరింత బలోపేతం చేయడంపై ఆయన దృష్టి సారించనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. లోకేశ్తో పాటు పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా 18 మంది నేతలు, ఇతర నూతన కార్యవర్గ సభ్యులు కూడా ప్రమాణం చేశారు. యువ నాయకత్వానికి ప్రాధాన్యం ఇస్తూ పార్టీ భవిష్యత్తును మరింత దృఢంగా తీర్చిదిద్దే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
