Breaking News

ఆకివీడు రామాలయం పిల్‌ కొట్టివేత… హైకోర్టు కీలక తీర్పు

అమరావతి, ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): ఆకివీడు రామాలయానికి సంబంధించిన పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (పిల్)పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పిల్‌ను చీఫ్ జస్టిస్ ధర్మాసనం బుధవారం కొట్టివేసింది.రామాలయం నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులు తీసుకున్నామని ఆలయ వర్గాలు కోర్టుకు వివరించాయి. అయితే అనుమతులు లేవని ఆరోపిస్తూ జడ శ్రవణ్ కుమార్ దాఖలు చేసిన పిల్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు.ఈ కేసులో ఆలయ సమితి తరపున సీనియర్ న్యాయవాది వై.వి. రవి ప్రసాద్ వాదనలు వినిపించారు. అన్ని అనుమతులు ఉన్నాయని సమర్థంగా వివరించడంతో కోర్టు పిల్‌ను తిరస్కరించింది.ఈ తీర్పుతో ఆకివీడు రామాలయం నిర్మాణానికి ఉన్న అడ్డంకులు తొలగినట్లయ్యాయి.

ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: రాంప్రసాద్ రెడ్డి

వైసీపీపై మంత్రి పార్థసారథి ఫైర్.. ‘గోబెల్స్ ప్రచారం’ అంటూ విమర్శలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *