Breaking News

ఇంధన అక్రమాలపై కఠిన చర్యలు… ‘నో స్టాక్’ మోసాలకు చెక్: మంత్రి మనోహర్

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన సరఫరా, అక్రమాలపై ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోంది. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులతో సమీక్ష నిర్వహించి అక్రమాలకు పాల్పడేవారిపై ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.టెలికాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో జిల్లాల వారీగా పెట్రోల్, డీజిల్ లభ్యత, సరఫరా పరిస్థితిపై చర్చించారు. ముఖ్యంగా ఇంధనాన్ని దాచిపెట్టి కృత్రిమ కొరత సృష్టించడం, పక్కదారి పట్టించడం వంటి చర్యలను కట్టడి చేయాలని మంత్రి ఆదేశించారు. కొన్ని పెట్రోల్ బంకుల్లో స్టాక్ ఉన్నప్పటికీ ‘నో స్టాక్’ బోర్డులు పెట్టి వినియోగదారులను తప్పుదారి పట్టిస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. అలాంటి యాజమాన్యాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఇంధన సరఫరాలో పారదర్శకత పెంచేందుకు ప్రతి బంకులో స్టాక్ వివరాలు ప్రదర్శించాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా సరఫరా జరిగేలా పర్యవేక్షణను బలోపేతం చేయాలని సూచించారు.రాష్ట్రంలో అమలు చేస్తున్న రేషన్ విధానాన్ని కొనసాగిస్తూ వినియోగాన్ని నియంత్రించాలని మంత్రి చెప్పారు. అవసరమైన ప్రాంతాల్లో అదనపు సరఫరా చర్యలు తీసుకోవాలని సూచించారు.వ్యవసాయ రంగానికి ఇంధన సరఫరాలో ప్రాధాన్యం ఇవ్వాలని, ముఖ్యంగా ఆక్వా మరియు వరి రైతులకు ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు.ఇంధన కొరతపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని పోలీసులకు సూచించారు. ప్రజలకు నిజమైన సమాచారం మాత్రమే చేరేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా ఇంధన సరఫరాను క్రమబద్ధీకరించి, అక్రమాలను అరికట్టడం ద్వారా ప్రజలకు సౌకర్యవంతమైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

రేపు ఉదయం 11కి ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల: మంత్రి నారా లోకేష్

రాష్ట్రమంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఘన స్వాగతం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *