బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ఇంధన అక్రమాలపై కఠిన చర్యలు… ‘నో స్టాక్’ మోసాలకు చెక్: మంత్రి మనోహర్

ఇంధన అక్రమాలపై కఠిన చర్యలు… ‘నో స్టాక్’ మోసాలకు చెక్: మంత్రి మనోహర్

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన సరఫరా, అక్రమాలపై ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోంది. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులతో సమీక్ష నిర్వహించి అక్రమాలకు పాల్పడేవారిపై ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.టెలికాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో జిల్లాల వారీగా పెట్రోల్, డీజిల్ లభ్యత, సరఫరా పరిస్థితిపై చర్చించారు. ముఖ్యంగా ఇంధనాన్ని దాచిపెట్టి కృత్రిమ కొరత సృష్టించడం, పక్కదారి పట్టించడం వంటి చర్యలను కట్టడి చేయాలని మంత్రి ఆదేశించారు. కొన్ని పెట్రోల్ బంకుల్లో స్టాక్ ఉన్నప్పటికీ ‘నో స్టాక్’ బోర్డులు పెట్టి వినియోగదారులను తప్పుదారి పట్టిస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. అలాంటి యాజమాన్యాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఇంధన సరఫరాలో పారదర్శకత పెంచేందుకు ప్రతి బంకులో స్టాక్ వివరాలు ప్రదర్శించాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా సరఫరా జరిగేలా పర్యవేక్షణను బలోపేతం చేయాలని సూచించారు.రాష్ట్రంలో అమలు చేస్తున్న రేషన్ విధానాన్ని కొనసాగిస్తూ వినియోగాన్ని నియంత్రించాలని మంత్రి చెప్పారు. అవసరమైన ప్రాంతాల్లో అదనపు సరఫరా చర్యలు తీసుకోవాలని సూచించారు.వ్యవసాయ రంగానికి ఇంధన సరఫరాలో ప్రాధాన్యం ఇవ్వాలని, ముఖ్యంగా ఆక్వా మరియు వరి రైతులకు ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు.ఇంధన కొరతపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని పోలీసులకు సూచించారు. ప్రజలకు నిజమైన సమాచారం మాత్రమే చేరేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా ఇంధన సరఫరాను క్రమబద్ధీకరించి, అక్రమాలను అరికట్టడం ద్వారా ప్రజలకు సౌకర్యవంతమైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్