ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న వార్తలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో ఎలాంటి ఇంధన కొరత లేదని, ప్రజలకు అవసరమైనంత సరఫరా అందుబాటులో ఉందని ఆయన తెలిపారు.సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని మంత్రి సూచించారు. ఇంధన సరఫరా పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని చెప్పారు.సరఫరా వ్యవస్థను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదుల కోసం 1967 టోల్ఫ్రీ నంబర్ను అందుబాటులో ఉంచామని వెల్లడించారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా పెంచడంతో పాటు, వ్యవసాయ అవసరాలకు డీజిల్ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో మానిటరింగ్ కమిటీలు పనిచేస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో డీజిల్ సరఫరాను 210% వరకు, పెట్రోల్ సరఫరాను 132% వరకు పెంచినట్లు వెల్లడించారు.ప్రస్తుతం రోజుకు మొత్తం 36,404 KL ఇంధనం సరఫరా అవుతోందని మంత్రి తెలిపారు. డీజిల్ సరఫరా 7,348 KL నుంచి 22,782 KLలకు పెరగగా, పెట్రోల్ సరఫరా 5,883 KL నుంచి 13,622 KLలకు పెరిగిందని వివరించారు. మొత్తంగా రోజువారీ సరఫరా సుమారు 175% పెరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
