Breaking News

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట… రూ.1000 కోట్ల నిధుల విడుదల

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్ సమస్యల పరిష్కారానికి కీలకంగా రూ.1000 కోట్ల నిధులను విడుదల చేసింది.ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఈ నిధులు విడుదలయ్యాయి. ఆర్థిక శాఖ అధికారులు ఈ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేశారు. గతంలో నెలకు రూ.700 కోట్లు విడుదల చేస్తామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు ఉద్యోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆ మొత్తాన్ని రూ.1000 కోట్లకు పెంచింది.ఏప్రిల్ నెలకు సంబంధించిన మొత్తాన్ని యుద్ధ ప్రాతిపదికన విడుదల చేయడంతో ఉద్యోగులపై ఉన్న ఆర్థిక ఒత్తిడి తగ్గనుంది. ముఖ్యంగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఇది పెద్ద ఊరటగా మారింది.అక్టోబర్ 2025 వరకు పెండింగ్‌లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల GPF బకాయిలను పూర్తిగా క్లియర్ చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు.అదేవిధంగా మెడికల్ బిల్లుల చెల్లింపులను కూడా ప్రభుత్వం వేగవంతం చేసింది. ఉద్యోగుల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని బిల్లులను ప్రాధాన్యతగా క్లియర్ చేస్తున్నట్లు సమాచారం.ఉద్యోగుల సంక్షేమం దిశగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మొత్తం మీద ఈ చర్యలు ప్రభుత్వ ఉద్యోగులకు గణనీయమైన ఉపశమనం కలిగించాయి.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *