ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. మంత్రి నారా లోకేష్ వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.వైసీపీ పాలనపై స్పందిస్తూ, “వైసీపీ సినిమాకు ఎండ్కార్డ్ వేసేది పసుపు సైన్యమే” అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనలో తమ ప్రభుత్వం ముందంజలో ఉందని ఆయన చెప్పారు. ఇప్పటివరకు 800 కంపెనీలను తీసుకువచ్చామని, తాజాగా 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని వివరించారు.అహంకారం రాజకీయాల్లో ఎంత ప్రమాదకరమో గత ఎన్నికల ఫలితాలు చూపించాయని లోకేష్ అన్నారు. “అహంకారం వస్తే ఏం జరుగుతుందో 2024 ఎన్నికల్లో చూశాం. వైసీపీకి క్రికెట్ టీమ్ మిగిలింది” అంటూ వ్యంగ్యంగా విమర్శించారు.వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తూ, అలాంటి అసత్య ప్రచారాలను ప్రజల్లోనే తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
