Breaking News

మే 10న తెలంగాణకు ప్రధాని మోదీ.. ₹7,823 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం: కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్రానికి మే 10న ప్రధాని మోదీ పర్యటనకు రానున్నారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తెలంగాణకు రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం.ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రంలో మొత్తం రూ.7,823 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ముఖ్యంగా పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిచ్చే కీలక ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్లు సమాచారం.జహీరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ సిటీని ప్రధాని ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రాంతీయ ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పరిశ్రమలకు కొత్త దారులు తెరుచుకోనున్నాయి.ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రధాని పర్యటనతో తెలంగాణ అభివృద్ధికి కొత్త ఊపొస్తుందని ఆయన తెలిపారు.ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు, అధికారిక కార్యక్రమాలపై ప్రభుత్వం ఇప్పటికే విస్తృతంగా ఏర్పాట్లు ప్రారంభించింది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *