నాగాయలంక, ఏప్రిల్ 30( నేటి తెలుగు పత్రిక): పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంక మండలం తలగడ దివి బిసి సంక్షేమ బాలికల వసతి గృహ విద్యార్థును లు 99 శాతం ప్రతిభ సాధించారు.575మార్కుల తో తిరుమల శెట్టి సిరి చందన హాస్టల్స్ లోజిల్లా స్థాయి ప్రధమ స్థానం,తో పాటు మరో ఎనిమిది మంది కి 500కు పై బడి మొదటి స్థానం లో నిలిచారు. వీరితోపాటు మరో 9 మంది విద్యార్థులు 500లోపు గా మార్కులు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచారు .మరో ముగ్గురు విద్యార్థినిలు ద్వితీయ స్థానంతో నిలబడ్డారు.మొత్తం 99శాతం ఫలితాలు సాదించడం పట్ల బాలికల సంక్షేమ శాఖ అధికారిణి టి నాగమణి ని జిల్లా బీసీ సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పి రమేష కృషిని జిల్లావ్యాప్తంగా మిగిలిన హాస్టల్ సంక్షేమ అధికారులు స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు .విద్యార్థులతో పాటు నాగమణి ని అయన అభినందించారు. ఇదే స్పూర్తితో భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని విద్యార్థులకు నాగమణి సూచించారు. ఇష్టమైన కోర్సులను ఎంపిక చేసుకుని భవిష్యత్తులో ఉన్నత విద్యను అభ్యసిస్తూ తల్లిదండ్రులకు విద్య నభ్యసించిన వసతి గృహాలకు గురువులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో సహాయ బీసీ సంక్షేమ అధికారి ఎండి షహతుల్లా విద్యార్థులు వసతి గృహ సిబ్బంది పాల్గొన్నారు.
