ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకా హత్య కేసు విచారణ మరో కీలక దశకు చేరుకుంది. హైదరాబాద్లోని సీబీఐ కోర్టులో జరిగిన తాజా విచారణలో పలు ముఖ్యాంశాలు బయటపడ్డాయి.వివేకా కుమార్తె Y. S. సునీత సీబీఐ దర్యాప్తుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు. ఆమె తరఫు న్యాయవాదులు, దర్యాప్తు పూర్తి స్థాయిలో జరగలేదని, ఇంకా కీలక విషయాలు బయటకు రావాల్సి ఉందని వాదించారు. ఈ నేపథ్యంలో మరింత లోతైన దర్యాప్తుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ కాపీలను కేసులోని నిందితులకు అందజేసినట్లు కోర్టుకు తెలియజేశారు. ఇదే కేసులో ఇప్పటికే సీబీఐ మూడు చార్జ్షీట్లు దాఖలు చేసినప్పటికీ, దర్యాప్తులో ఇంకా లోపాలు ఉన్నాయని సునీత వర్గం అభిప్రాయపడుతోంది. ఇదిలా ఉండగా, చైతన్యరెడ్డి, కిరణ్ యాదవ్లకు ఈ కేసుతో సంబంధం లేదని సీబీఐ తేల్చినట్లు సమాచారం. దీంతో కేసులో కొన్ని సందేహాలు తొలగినా, ప్రధాన అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.ఈ కేసు తదుపరి విచారణను కోర్టు మే 4వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజున సునీతారెడ్డి పిటిషన్పై కీలక వాదనలు జరిగే అవకాశముంది.
