మే 01, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా, పరిపాలన పరంగా తాను మరియు పవన్ కళ్యాణ్ ఎలాంటి ఇగోలకు లోనుకాకుండా ప్రజల ప్రయోజనాల కోసం కలిసి పని చేస్తున్నామని తెలిపారు. అదే విధంగా అధికారులు కూడా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్-2025 అవార్డు అందుకున్న సందర్భంగా మంత్రులు, అధికారులకు సీఎం ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయ జీవితంలో ఎన్నో విజయాలను చూశానని, అయితే 2024 ఎన్నికల్లో వచ్చిన విజయం ప్రత్యేకమైందని, గతంలో అలాంటి విజయం చూడలేదని చంద్రబాబు పేర్కొన్నారు.
