మే 01, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని భావించి 18 నెలల చిన్నారిని దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మూడు రోజుల క్రితం జరిగినప్పటికీ ఆలస్యంగా బయటపడింది.గన్నవరం చెంచుల కాలనీకి చెందిన ఓ మహిళకు విజయవాడకు చెందిన వంశీ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఉన్నట్లు సమాచారం. ఇటీవల ఇద్దరి మధ్య తగాదా చోటుచేసుకోగా, ఆ సమయంలో ఆగ్రహంతో వంశీ చిన్నారిని గోడకేసి కొట్టాడు. తీవ్ర గాయాలతో చిన్నారి మృతి చెందినట్లు తెలిసింది.ఈ ఘటనపై గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు కాగా, పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం కేసును విజయవాడ పోలీసులకు బదిలీ చేశారు. పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
