Breaking News

ఈవీఎంలపై మమత ఆగ్రహం.. స్ట్రాంగ్‌రూమ్‌లో 3 గంటలు గడిపి హెచ్చరికలు

మే 01, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలోని స్ట్రాంగ్‌రూమ్‌ను సందర్శించి ఈవీఎంల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణ కోల్‌కతాలోని సఖావత్ మెమోరియల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌లో ఆమె మూడు గంటలకు పైగా గడిపారు.మే 4న జరగనున్న ఓట్ల లెక్కింపుకు ముందు ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయంటూ ఆమె ఆరోపించారు. సీసీటీవీ ఫుటేజీలో అనుమానాస్పద దృశ్యాలు కనిపించడంతోనే తాను స్వయంగా పరిశీలనకు వచ్చినట్లు తెలిపారు. మొదట అధికారులు అనుమతి ఇవ్వకపోయినా, అభ్యర్థిగా తన హక్కును వినియోగించి లోపలికి వెళ్లినట్లు చెప్పారు.స్ట్రాంగ్‌రూమ్ నుంచి బయటకు వచ్చిన అనంతరం ఆమె తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈవీఎంలను తారుమారు చేయడానికి చేసే ఏ ప్రయత్నాన్నైనా తుదివరకు ఎదుర్కొంటామని, అవసరమైతే ప్రాణాలొడ్డి పోరాడతామని స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణలో లోపాలు ఉన్నాయని, కొన్ని చర్యలు పక్షపాతంగా ఉన్నాయని ఆరోపించారు.ఇదే సమయంలో తృణమూల్ కాంగ్రెస్ విడుదల చేసిన వీడియోలో నిబంధనలు ఉల్లంఘిస్తూ బ్యాలెట్ పెట్టెలను తెరుస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ పరిణామాలతో పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరింత ఉత్కంఠభరితంగా మారాయి.

మైనర్ల పాస్‌పోర్ట్‌పై కఠిన నిబంధనలు.. పౌరసత్వ ప్రక్రియల్లో కేంద్రం సంచలన మార్పులు

ఏపీకి కేంద్రం నుంచి రూ.1192 కోట్ల మంజూరు.. గ్రామీణ ఉపాధికి ఊతం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *