Breaking News

శ్రామికులే అభివృద్ధికి అసలు బలం: మంత్రి నారా లోకేశ్

మే 01, (నేటి తెలుగు పత్రిక): మే డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. సమాజ ప్రగతిలో కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.సామాజిక మాధ్యమం వేదికగా స్పందించిన లోకేశ్, శ్రమతోనే అభివృద్ధి సాధ్యమని, శ్రామికుడు లేనిదే ప్రపంచం ముందుకు సాగదని అన్నారు. కార్మికుల కృషి దేశ నిర్మాణానికి మూలస్తంభమని కొనియాడారు.కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, వారికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. కార్మికులు గౌరవంగా జీవించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు.

ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: రాంప్రసాద్ రెడ్డి

వైసీపీపై మంత్రి పార్థసారథి ఫైర్.. ‘గోబెల్స్ ప్రచారం’ అంటూ విమర్శలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *