మే 01, (నేటి తెలుగు పత్రిక): అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. అంకితభావంతో సమాజాన్ని ముందుకు నడిపిస్తున్న శ్రామిక సోదర సోదరీమణుల కృషిని ఆమె ప్రశంసించారు.కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కార్మికులు, కర్షకులే దేశ ఆర్థిక వ్యవస్థకు పునాది అని తెలిపారు. మేడే కార్మికుల పోరాటాలకు ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు.అన్నిరంగాల కార్మికులకు ఆరోగ్యం, ఆనందం కలగాలని, వారి కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం కార్మిక సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూనే వారి జీవనోపాధి మెరుగుపడేలా చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
