Breaking News

కవిత భయంతోనే కేసీఆర్ బయటకు.. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

మే 01, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు మరింత వేడెక్కుతున్నాయి. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు చేశారు. టీఆర్‌ఎస్ నాయకురాలు కవిత కారణంగానే కేసీఆర్ మళ్లీ చురుకుగా మారుతున్నారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో మాట్లాడిన ఆయన, హైడ్రా అంశంపై కేసీఆర్ అవగాహన పెంచుకోవాలని సూచించారు. అక్రమ కబ్జాలపై చర్యలు తీసుకోవడంలో ఎలాంటి తప్పులేదని పేర్కొన్నారు. నగర పరిసర ప్రాంతాల్లో చెరువులపై కబ్జాలు జరిగాయని ఆరోపించారు.ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని, త్వరలోనే ఖాళీ పదవులను భర్తీ చేస్తామని తెలిపారు. మంత్రివర్గ విస్తరణపై తుది నిర్ణయం ముఖ్యమంత్రి తీసుకుంటారని స్పష్టం చేశారు.

తెలంగాణ భవన్‌లో ఘనంగా మే డే ఉత్సవాలు – పాల్గొన బీఆర్ఎస్ నేతల

మల్కాజిగిరికి కొత్త పోలీస్ కమిషనర్.. బి. సుమతి నియామకం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *