మే 01, (నేటి తెలుగు పత్రిక): అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఉత్పత్తి రంగంలో భాగమై దేశ సంపదను సృష్టిస్తున్న కార్మికుల కష్టం, వారి త్యాగాలు అమూల్యమైనవని పేర్కొన్నారు.మే డే స్ఫూర్తితో గత బీఆర్ఎస్ ప్రభుత్వం సబ్బండ కులాల కర్షక, కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. పారిశ్రామిక అభివృద్ధికి అనుకూల విధానాలు అమలు చేసి రాష్ట్రంలో ఉపాధి అవకాశాలను పెంచినట్లు గుర్తుచేశారు. సింగరేణి, ఆర్టీసీ, భవన నిర్మాణ రంగం, ఆటో డ్రైవర్లు, దినసరి కూలీలు, అసంఘటిత రంగ కార్మికుల కోసం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రస్తావించారు. గత పదేళ్ల అభివృద్ధి కార్యక్రమాలను మరింత బలపరచడం ద్వారా కార్మికులకు మేలు చేకూరుతుందని తెలిపారు.
