మే 01, (నేటి తెలుగు పత్రిక): మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి. సుమతిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కమిషనర్గా ఉన్న అవినాశ్ మహంతిని డ్రగ్ నియంత్రణ విభాగానికి బదిలీ చేసింది.వేగంగా అభివృద్ధి చెందుతున్న మల్కాజిగిరి ప్రాంతంలో భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, నేరాల నియంత్రణ కీలకంగా మారిన నేపథ్యంలో అనుభవం ఉన్న అధికారిణిని ఈ బాధ్యతలకు నియమించినట్లు ప్రభుత్వం తెలిపింది. గతంలో నిర్వహించిన బాధ్యతల్లో సుమతి సమర్థతను చూపినట్లు అధికారులు పేర్కొన్నారు.డ్రగ్ వినియోగం, అక్రమ రవాణా పెరుగుతున్న పరిస్థితుల్లో అవినాశ్ మహంతిని డ్రగ్ నియంత్రణ విభాగానికి పంపడం ప్రాధాన్యత పొందింది. డ్రగ్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉందని సమాచారం.అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్గా ఉన్న డాక్టర్ తరుణ్ జోషిని ప్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్గా నియమించారు. ఈ ప్రాంతం రాష్ట్రానికి ప్రతిష్ఠాత్మకంగా ఉండటంతో అనుభవజ్ఞుడైన అధికారిని నియమించినట్లు తెలిపారు.ప్రస్తుతం ప్యూచర్ సిటీ కమిషనర్గా ఉన్న సుధీర్బాబు ఈ నెల చివరలో పదవీ విరమణ పొందనుండగా, ఆయన స్థానంలో తరుణ్ జోషిని నియమిస్తూ ముందస్తు ఉత్తర్వులు జారీ చేశారు.ఈ మార్పులతో పోలీస్ శాఖలో పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని, ప్రజలకు మెరుగైన భద్రత, సమర్థ సేవలు అందుతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.
