Breaking News

తెలంగాణ భవన్‌లో ఘనంగా మే డే ఉత్సవాలు – పాల్గొన బీఆర్ఎస్ నేతల

మే 01, (నేటి తెలుగు పత్రిక): మే డే సందర్భంగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి. రామారావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, వి. శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా బీఆర్టీయూ అధ్యక్షుడు రాంబాబు యాదవ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముందుగా కేటీఆర్ బీఆర్టీయూ జెండాను ఆవిష్కరించారు.“జై తెలంగాణ”, “బీఆర్‌ఎస్ జిందాబాద్”, “కేసీఆర్ నాయకత్వం వర్థిల్లాలి” వంటి నినాదాలతో తెలంగాణ భవన్ పరిసరాలు మార్మోగాయి. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పిస్తూ కార్యక్రమం కొనసాగింది.ఈ కార్యక్రమంలో డాక్టర్ చెరుకు సుధాకర్, డాక్టర్ చిరుమళ్ల రాకేష్, అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, విద్యాసాగర్, కిశోర్ గౌడ్ తదితర నాయకులు కూడా పాల్గొన్నారు.

జంతు హింసపై యాంకర్ రష్మి ఆగ్రహం.. వైసీపీ నిరసనపై విమర్శలు

మల్కాజిగిరికి కొత్త పోలీస్ కమిషనర్.. బి. సుమతి నియామకం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *