మే 01, (నేటి తెలుగు పత్రిక):: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకు అలహాబాద్ హైకోర్టులో ఊరట లభించింది. ఆయన చేసిన వ్యాఖ్యలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది.2025లో చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషనర్ సిమ్రాన్ గుప్తా కోర్టును ఆశ్రయించారు. ఆ వ్యాఖ్యలు జాతీయ సమగ్రతకు ముప్పు కలిగిస్తాయని పేర్కొంటూ కేసు నమోదు చేయాలని కోరారుఅయితే దిగువ కోర్టు పిటిషన్ను తిరస్కరించగా, ఆ నిర్ణయాన్ని హైకోర్టులో సవాలు చేశారు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి పిటిషన్లో సరైన ఆధారాలు లేవని భావించి దానిని కొట్టివేశారు.దీంతో రాహుల్ గాంధీకి ఈ వ్యవహారంలో ఉపశమనం లభించింది.
