మే 01, (నేటి తెలుగు పత్రిక): దేశంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరగడంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల తర్వాత ధరలు పెరుగుతాయని తాను ముందే చెప్పానని పేర్కొన్నారు.ఒక్కసారిగా సిలిండర్ ధరలు గణనీయంగా పెరగడం సామాన్య ప్రజలపై భారం పెంచుతుందని అన్నారు. గత కొన్ని నెలల్లోనే గ్యాస్ ధరలు భారీగా పెరిగాయని, ఇది వ్యాపారులు, చిన్న స్థాయి దుకాణాలపై ప్రభావం చూపుతోందని వివరించారు.టీ దుకాణాలు, హోటళ్లు, బేకరీలు వంటి వ్యాపారాల ఖర్చులు పెరిగి, చివరికి ప్రజల ఆహార ఖర్చులపై ప్రభావం పడుతుందని తెలిపారు. ముందుగా గ్యాస్ ధరలు, తరువాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని హెచ్చరించారు.ఎన్నికల సమయంలో ధరలను నియంత్రించి, తర్వాత ఒక్కసారిగా పెంచడం ప్రజలపై భారాన్ని మోపడం మాత్రమేనని విమర్శించారు.
