Breaking News

హ్యామ్ రోడ్ల టెండర్లపై హరీశ్‌రావు ఆరోపణలు

మే 02, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో హ్యామ్ రోడ్ల టెండర్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు తీవ్ర ఆరోపణలు చేశారు. అంచనా విలువ కంటే ఎక్కువ ధరలకు టెండర్లు కట్టబెడుతూ అవినీతి జరుగుతోందని విమర్శించారు. అసెంబ్లీలో తాము చెప్పిన విషయాలే ఇప్పుడు నిజమవుతున్నాయని అన్నారు.ఆర్‌అండ్‌బీ మరియు పంచాయతీరాజ్ శాఖల్లో మొత్తం 25 టెండర్లను అధిక ధరలకు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైందని ఆయన ఆరోపించారు. ఆర్‌అండ్‌బీ శాఖలో రూ.11 వేల కోట్ల పనులను దాదాపు రూ.15 వేల కోట్లకు, పంచాయతీరాజ్ శాఖలో రూ.6 వేల కోట్ల పనులను సుమారు రూ.8 వేల కోట్లకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు.ఈ టెండర్లలో ఒకే కంపెనీకి ఎక్కువ ప్రాజెక్టులు దక్కే అవకాశముందని, పూర్తి వివరాలను త్వరలో ఆధారాలతో బయటపెడతానని హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యల వల్ల ఖజానాకు భారీ నష్టం వాటిల్లడంతో పాటు ప్రజలపై కూడా భారం పడుతుందని విమర్శించారు.టెండర్లలో 10 శాతం మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విధానాన్ని రద్దు చేసి, అధిక ధరల టెండర్లను వెంటనే రీకాల్ చేసేదని గుర్తు చేశారు. ప్రస్తుతం అధిక శాతం ఎక్సెస్ టెండర్లు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు.రిటైర్డ్ అధికారుల పదవీకాలాన్ని పొడిగిస్తూ టెండర్ల ప్రక్రియ కొనసాగించడం కూడా అనుమానాస్పదమని హరీశ్‌రావు విమర్శించారు. హ్యామ్ రోడ్లకు సంబంధించిన ఎక్సెస్ టెండర్లను వెంటనే రద్దు చేసి, అన్ని టెండర్లను తిరిగి పిలవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

“ఇదేనా కలికాలం?”.. కుక్కల రక్తం అక్రమ వ్యాపారంపై రేణు దేశాయ్ ఆగ్రహం

ఓఆర్‌ఆర్ ప్రమాదం విషాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురి మృతి, ఉస్మానియాలో బాధితులను పరామర్శించిన కేటీఆర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *