హైదరాబాద్, మే 02, (నేటి తెలుగు పత్రిక): కాంగ్రెస్ నాయకులపై ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్ర విమర్శలు చేశారు. దేశవ్యాప్తంగా గ్యాస్ ధరల పెరుగుదలపై అవగాహన లేకుండా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో పెద్దగా అభివృద్ధి జరగలేదని అర్వింద్ ఆరోపించారు. ప్రజా సమస్యల కంటే కుటుంబ ఆస్తుల పెంపుపైనే దృష్టి పెట్టారని విమర్శించారు.ఉత్తమ్ కుమార్ రెడ్డి పై కూడా ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. సివిల్ సప్లై శాఖలో అవినీతి అధికంగా జరుగుతోందని, ఇరిగేషన్ శాఖలో కూడా పాత వ్యవస్థల ప్రభావం కొనసాగుతోందని పేర్కొన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు కంటే పెద్ద స్థాయిలో అవినీతి జరుగుతోందని ఆరోపిస్తూ, కేసీఆర్ కుటుంబాన్ని రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కాపాడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.అర్వింద్ చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
