Breaking News

కామారెడ్డి ఎమ్మెల్యేపై పరువు నష్టం దావా

కామారెడ్డి, మే 02, (నేటి తెలుగు పత్రిక): కామారెడ్డి ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డిపై పరువు నష్టం దావా నమోదు అయ్యింది. నాంపల్లి ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఈ కేసులో నోటీసులు జారీ చేసినట్లు హైకోర్టు న్యాయవాది సుమంత్ తెలిపారు.శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన, గత ఫిబ్రవరి 17, 21 తేదీల్లో ఎమ్మెల్యే నిర్వహించిన విలేకరుల సమావేశాల్లో ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ కుమారుడు ఇలియాస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పారు. నిరాధార ఆరోపణలతో తన పరువుకు నష్టం కలిగించారని పేర్కొంటూ ఇలియాస్ కోర్టును ఆశ్రయించినట్లు వెల్లడించారు.ఫిర్యాదును పరిశీలించిన కోర్టు, క్రిమినల్ డిఫమేషన్ కింద కేసు నమోదు చేసి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని ఈ నెల 20న కోర్టులో వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది.ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *