అమరావతి, మే 02, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్కు చెందిన ఉపాధ్యాయుల బృందం సింగపూర్ పర్యటనకు సిద్ధమైంది. ఈ నెల 4 నుంచి 9 వరకు సింగపూర్లో ఈ బృందం పర్యటించనుంది.ఇప్పటికే ఉపాధ్యాయులు విజయవాడ నుంచి హైదరాబాద్కు చేరుకుని, అక్కడి నుంచి సింగపూర్కు బయలుదేరనున్నారు. ఈ పర్యటన కోసం రాష్ట్రవ్యాప్తంగా 37 మంది ఉత్తమ ఉపాధ్యాయులను అధికారులు ఎంపిక చేశారు.సింగపూర్లో అమలవుతున్న ఆధునిక విద్యా విధానాలు, బోధనా పద్ధతులను ఈ బృందం అధ్యయనం చేయనుంది. అక్కడి అనుభవాలను రాష్ట్రంలో అమలు చేయడం ద్వారా విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని ప్రభుత్వం భావిస్తోంది.ఇక మిగిలిన ఉత్తమ ఉపాధ్యాయులను కూడా త్వరలో ఫిన్లాండ్కు పంపించి అక్కడి విద్యా విధానాన్ని అధ్యయనం చేయించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.
