చిన్న తరహా పరిశ్రమలకు శిక్షణ, రుణాలు
విజయవాడ. మే 2 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విజయవాడ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు, ఉపాధి లేని నిరుద్యోగు లకు అండగా నిలిచేందు కు ‘ఉద్యోగ భారత్ ఇండ స్ట్రియల్ డెవలప్మెంట్’ మిషన్ కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ చైర్మన్ చాగింటి పాటీ జాన్ వెస్లీ తెలిపారు. శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మార్గనిర్దేశంలో నిరుద్యోగ యువతకు ఈ మిషన్ ద్వారా నైపుణ్య శిక్షణ, ఆర్థిక చేయూతనిస్తామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ను ప్రతి గ్రామం, నియోజ కవర్గం, జిల్లా స్థాయికి తీసుకెళ్లడమే తమ లక్ష్య మని విస్లీ వెల్లడించారు. ముఖ్యంగా ఆహార శుద్ధి, చాక్లెట్లు, బిస్కెట్ల తయారీ వంటి చిన్న తరహా పరిశ్ర మలు ఏర్పాటు చేసుకునే వారికి శిక్షణతో పాటు లోన్లు అందజేసి ప్రోత్సహి స్తామని వివరించారు. నిరుపేదలకు, వెనుకబడి న వర్గాల వారికి ఈ పథ కం ఎంతో మేలు చేస్తుంద ని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర చైర్మన్గా అద్దంకి రంజిత్ తోరి బాధ్యతలు స్వీకరిం చారని ఆంధ్రప్రదే శ్లో కూడా ప్రతి జిల్లాకు ఒక చైర్మన్ను కోర్ కమిటీ ని నియమిస్తామని తెలి పారు. బాధ్యతాయుతం గా పనిచేసే వ్యక్తులనే ఈ పదవులకు ఎంపిక చేస్తా మని స్పష్టం చేశారు. ఈ మిషన్ అమలులో సహ కారం కోరుతూ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడుకు త్వరలో నే లేఖ రాయనున్నట్లు వెల్ల డించారు. ప్రస్తుత కూట మి ప్రభుత్వ పాలనలో పేదలకు మేలు జరుగు తుండటం సంతోషకరమ ని పేర్కొన్నారు. ఈ కార్య క్రమంలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రాసెసిం గ్ కౌన్సిల్ నేషనల్ జనర ల్ సెక్రటరీ ఎం. తారస్రవం తి, రాష్ట్రీయ ఉద్యోగ భారత్ నేషనల్ ఆర్గనైజిం గ్ సెక్రటరీ సునీల్ కుమార్ మడ్వా, తెలంగాణ చైర్మన్ అద్దంకి రంజిత్ ఓఫిర్ తదితరులు పాల్గొన్నారు.

