Breaking News

నెల్లూరులో మహానాడు ఘనంగా.. భారీ ఏర్పాట్లు: మంత్రి ఆనం

నెల్లూరు, మే 03, (నేటి తెలుగు పత్రిక): తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మక మహానాడును ఈసారి నెల్లూరు జిల్లాలో అత్యంత ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. కార్యక్రమం కోసం అనువైన స్థలాలను పరిశీలించి, నివేదికలను పార్టీ అధిష్టానానికి పంపించినట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పార్టీ స్థాపకుడు నందమూరి తారక రామారావు ప్రారంభించిన మహానాడు సంప్రదాయం 44 ఏళ్లుగా కొనసాగుతోందన్నారు. ఈసారి మహానాడును నెల్లూరులో నిర్వహించాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ నిర్ణయించారని చెప్పారు.మహానాడుకు భారీగా డెలిగేట్లు హాజరుకానున్నారని, మొదటి రెండు రోజుల్లో కనీసం 25 వేల మంది పాల్గొంటారని, మూడో రోజు జరిగే బహిరంగ సభకు సుమారు 8 లక్షల మంది హాజరవుతారని అంచనా వేశారు.ఉత్తరాంధ్రలో పరిశ్రమల అభివృద్ధిపై మాట్లాడుతూ, భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరవుతారని తెలిపారు. విశాఖపట్నంలో గూగుల్ సంస్థకు శంకుస్థాపన జరిగిన విషయాన్ని ప్రస్తావించారు.రాష్ట్రంలో రహదారులు, రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి చెప్పారు. గతంలో వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని విమర్శిస్తూ, ప్రస్తుతం రోడ్ల అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో లైంగిక వేధింపుల కలకలం.. నలుగురిపై చర్యలు

ఆకివీడులో రామాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *