కరీంనగర్, మే 04, (నేటి తెలుగు పత్రిక): కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ దేశవ్యాప్తంగా ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో అనేక అరాచకాలు జరిగాయని, చొరబాటుదారులపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని అన్నారు.సోమవారం కరీంనగర్లో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కలలు కంటున్నారని విమర్శించారు. సీఎం ఎక్కడికి వెళ్లినా అక్కడ కాంగ్రెస్కు ఓటమి తప్పదని ఎద్దేవా చేశారు.కేరళలో ప్రభుత్వంపై వ్యతిరేకత కారణంగా కాంగ్రెస్కు కొంత అనుకూల పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్లో ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు.రాహుల్ గాంధీనే బీజేపీకి అసలు ప్రచారకర్తగా మారారని బండి సంజయ్ కుమార్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
