హైదరాబాద్, మే 04, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ ఉమెన్ సేఫ్టీ వింగ్ ‘షీటీమ్స్’లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ సురేష్ అదృశ్యమైన ఘటన ఆందోళన కలిగిస్తోంది. విధి నిర్వహణలో ఉండగానే కార్యాలయం నుంచి బయటకు వెళ్లిన ఆయన, ట్యాంక్ బండ్ వైపు నడుచుకుంటూ వెళ్తున్న సీసీటీవీ దృశ్యాలు బయటపడ్డాయి.సమాచారం ప్రకారం, గన్మెన్తో జరిగిన వివాదం మరియు ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా సురేష్ మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేసినట్టు కూడా సమాచారం వినిపిస్తోంది.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు ప్రారంభించారు. సురేష్ ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు వెతుకుతున్నాయి.
