Breaking News

తీరు మార్చుకోకపోతే వైసీపీకి గుండు సున్నా: మంత్రి నారాయణ హెచ్చరిక

నెల్లూరు, మే 04, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో గత ప్రభుత్వం భారీ అప్పుల భారం మోపిందని మంత్రి నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. దస్తగిరి నగర్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత పాలనలో పరిశ్రమలు వెళ్లిపోయి, రియల్ ఎస్టేట్ రంగం క్షీణించిందన్నారు.ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అప్పులు తగ్గిస్తూ అభివృద్ధి పనులను వేగంగా ముందుకు తీసుకెళ్తోందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందన్నారు. లోకేశ్ కృషితో కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయని, ఈ ఏడాది దేశవ్యాప్తంగా వచ్చిన పరిశ్రమల్లో గణనీయమైన వాటా ఆంధ్రప్రదేశ్‌కే దక్కిందని వివరించారు.పరిశ్రమల రాకతో రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని, ఉద్యోగ అవకాశాలు విస్తరిస్తాయని మంత్రి పేర్కొన్నారు. మహానాడు నిర్వహణపై వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.వైసీపీ తన వైఖరిని మార్చుకోకపోతే ప్రజలు పూర్తిగా తిరస్కరిస్తారని, వచ్చే ఎన్నికల్లో గుండు సున్నా తప్పదని మంత్రి నారాయణ ఘాటుగా హెచ్చరించారు.

ఏపీలో ప్రాపర్టీ కార్డుల జారీకి శ్రీకారం

విద్యార్థులకు శుభవార్త.. లోకేష్ సమక్షంలో ఒప్పందం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *