అమరావతి, మే 04, (నేటి తెలుగు పత్రిక): సంత్ త్యాగరాజ 259వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఘనంగా నివాళులర్పించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన, త్యాగరాజ భారతీయ సంగీత సంప్రదాయానికి అపారమైన సేవలు అందించిన మహానుభావుడని కొనియాడారు.శ్రీరామ భక్తిలో లీనమై తత్వశాస్త్రం, భావోద్వేగం, ఆధ్యాత్మిక అనుభూతిని కలగలిపిన కీర్తనలు రచించిన గొప్ప స్వరకర్తగా త్యాగరాజ నిలిచారని పవన్ తెలిపారు. సంగీత సంప్రదాయం ప్రకారం ఆయన వేలాది కీర్తనలు రచించినప్పటికీ, ప్రస్తుతం కొద్ది సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.ఈ అమూల్యమైన సంగీత వారసత్వాన్ని భవిష్యత్తు తరాలకు పరిరక్షించడం అందరి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. త్యాగరాజ జన్మస్థలమైన ఆంధ్రప్రదేశ్లో ఆయన వారసత్వాన్ని మరింత భక్తిశ్రద్ధలతో కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు.సాంస్కృతిక శాఖ సమన్వయంతో త్యాగరాజ రచనలకు సంబంధించిన రాతప్రతులు, స్వరలిపులు, అరుదైన రికార్డింగ్లు డిజిటలైజ్ చేయనున్నట్లు పవన్ కల్యాణ్ వెల్లడించారు.
