మే 04, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ విజయ దిశగా సాగుతున్న సమయంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఆ పార్టీ అధినేత విజయ్ నివాసానికి ప్రముఖ నటి త్రిష చేరుకున్నారు. ఎన్నికల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించే పరిస్థితులు కనిపిస్తున్న వేళ విజయ్కు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా త్రిష ఇటీవల తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తీసుకువచ్చిన లడ్డూ ప్రసాదాన్ని విజయ్కు అందజేశారు. ఇదే సమయంలో త్రిష జన్మదినాన్ని పురస్కరించుకొని విజయ్ కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.
