న్యూఢిల్లీ, మే 04, (నేటి తెలుగు పత్రిక): నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై భారతీయ జనతా పార్టీ సెటైర్లు గుప్పించింది. గత రెండు దశాబ్దాల్లో జరిగిన ఎన్నికలు, ఉపఎన్నికల్లో 99 ఓటములతో రికార్డు సృష్టించారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది.రాష్ట్రాలు మారినా, సంవత్సరాలు మారినా ఫలితాలు మాత్రం మారడం లేదని, ఎంత ప్రచారం చేసినా చివరికి ఓటమినే ఎదుర్కొంటున్నారని బీజేపీ విమర్శించింది. ‘నినాదాలు మారినా ఫలితం ఒక్కటే.. ఓటమి. వెల్ డన్ రాహుల్’ అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.ఈ వ్యాఖ్యలు ప్రస్తుత ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
