మే 04, (నేటి తెలుగు పత్రిక): కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి సాధించిన ఘన విజయంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ఫలితాలను చారిత్రాత్మక విజయంగా అభివర్ణిస్తూ పార్టీ శ్రేణులకు అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ నాయకత్వాన్ని ఆయన ప్రశంసించారు. వారి మార్గదర్శకత్వమే ఈ విజయానికి కీలకమని పేర్కొన్నారు.కేరళలో తన ప్రచారానికి ప్రజలు చూపిన ఆదరణకు రేవంత్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రజల తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ విజయం తెలంగాణ కాంగ్రెస్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వంతో కేరళ అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలు, అభివృద్ధి లక్ష్యాలతో రెండు రాష్ట్రాలు ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు.
