Breaking News

హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం.. ఆరు దుకాణాలు దగ్ధం

మే 05, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ నగరంలో అగ్నిప్రమాదం కలకలం రేపింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంపేట్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఆరు ఫర్నిచర్ దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.పోలీసుల సమాచారం మేరకు, ప్రధాన రహదారిపై ఉన్న ఫర్నిచర్ షాపుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దుకాణాల్లో కలప, కుషన్లు వంటి పదార్థాలు ఎక్కువగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించి పక్క షాపులను కూడా చుట్టుముట్టాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.18 నుంచి 20 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అంచనా.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గంటల తరబడి శ్రమించి మంటలు మరింత వ్యాపించకుండా నియంత్రించారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే పూర్తి వివరాలు తెలుసుకునేందుకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఫోరెన్సిక్ బృందం నమూనాలు సేకరించి విచారణను వేగవంతం చేసింది.ఇటీవల కూడా ఇదే ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ వ్యవస్థలో లోపాలా? లేక భద్రతా ప్రమాణాల నిర్లక్ష్యమా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ఎంఎంటీఎస్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్

కేసీఆర్ కుటుంబంపై చర్యలు తీసుకునే ధైర్యం రేవంత్‌కు ఉందా?: బండి సంజయ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *