మే 05, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో రామాలయం నిర్మాణానికి ఇచ్చిన అనుమతులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఆ ప్రాంతంలో గత 80 సంవత్సరాలుగా రామాలయం ఉన్నట్లు స్పష్టమవుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.జిల్లా కలెక్టర్, నగర పంచాయితీ కమిషనర్ అన్ని రికార్డులు పరిశీలించిన తరువాతే నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో అనుమతులను సవాల్ చేయడానికి ఆధారాలు లేవని తెలిపింది.ముందుగా ఇదే అంశంపై దాఖలైన మరో పిల్ను కూడా హైకోర్టు విచారించి ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. తాజాగా దాఖలైన రిట్ పిటిషన్ను పరిశీలించిన ధర్మాసనం, అన్ని వాదనలు విన్న అనంతరం పిటిషన్ను కొట్టివేసింది.
