Breaking News

ఆకివీడు రామాలయం నిర్మాణానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ – పిటిషన్ కొట్టివేత

మే 05, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో రామాలయం నిర్మాణానికి ఇచ్చిన అనుమతులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఆ ప్రాంతంలో గత 80 సంవత్సరాలుగా రామాలయం ఉన్నట్లు స్పష్టమవుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.జిల్లా కలెక్టర్, నగర పంచాయితీ కమిషనర్ అన్ని రికార్డులు పరిశీలించిన తరువాతే నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో అనుమతులను సవాల్ చేయడానికి ఆధారాలు లేవని తెలిపింది.ముందుగా ఇదే అంశంపై దాఖలైన మరో పిల్‌ను కూడా హైకోర్టు విచారించి ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. తాజాగా దాఖలైన రిట్ పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం, అన్ని వాదనలు విన్న అనంతరం పిటిషన్‌ను కొట్టివేసింది.

ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ – విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు

లోకేశ్ కృషితో ఏపీలో భారీ పెట్టుబడి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *