Breaking News

జూబ్లీహిల్స్ బాలికల ట్రాప్ కేసు.. సజ్జనార్ స్పెషల్ ఫోకస్

మే 05, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన బాలికల ట్రాప్ కేసు సంచలనంగా మారింది. ఈ కేసుపై నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ ప్రత్యేక దృష్టి సారించారు.పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు బయటపడ్డాయి. ఇద్దరు అన్నదమ్ములు కలిసి మొత్తం 19 మంది మైనర్ బాలికలను టార్గెట్ చేసి ట్రాప్ చేసినట్లు గుర్తించారు. ప్రధాన నిందితులు అర్జున్ (చంద్రశేఖర్ ఆజాద్) మరియు అతని సోదరుడు ప్రవీణ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు.

సజ్జనార్ వెల్లడించిన వివరాల ప్రకారం:

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • సోషల్ మీడియా, ముఖ్యంగా Instagram ద్వారా మైనర్లను టార్గెట్ చేశారు
  • ఖరీదైన కార్లు, లైఫ్‌స్టైల్ చూపించి బాలికలను ఆకర్షించారు
  • ఫిజికల్ రిలేషన్‌కు ఒత్తిడి చేసి, ఆ ఘటనలను వీడియోగా రికార్డ్ చేశారు
  • తర్వాత వాటితో బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు

ఒక బాధిత బాలిక నుంచి ఏకంగా రూ.13 లక్షలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులకు వారి తల్లి కూడా సహకరించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ గ్యాంగ్ గుంటూరు ప్రాంతానికి చెందినదిగా పోలీసులు గుర్తించారు.గతంలో కూడా ఇదే తరహా కేసులో నిందితుడు అరెస్ట్ అయినప్పటికీ, బయటకు వచ్చి మళ్లీ అదే నేరాలకు పాల్పడినట్లు సమాచారం. పోలీసులు కేసును తీవ్రంగా విచారిస్తూ, బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యంగా దర్యాప్తును కొనసాగిస్తున్నారు. సోషల్ మీడియాలో అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *