Breaking News

కేసీఆర్ కుటుంబంపై చర్యలు తీసుకునే ధైర్యం రేవంత్‌కు ఉందా?: బండి సంజయ్

మే 05, (నేటి తెలుగు పత్రిక): కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కుటుంబంపై చర్యలు తీసుకునే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదా అని ఆయన ప్రశ్నించారు.మీడియాతో మాట్లాడిన బండి సంజయ్, కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అవినీతిపై కూడా ప్రభుత్వం వెనుకడుగు వేస్తోందని విమర్శించారు. అన్ని కేసులను సీబీఐకి అప్పగించడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.అంతేకాకుండా రైతుల సమస్యలపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని, వెంటనే పంట కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. కోతలు విధిస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తామని హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు సరైన సమాధానం ఇస్తారని బండి సంజయ్ అన్నారు. మోదీ పట్ల రేవంత్ రెడ్డి భయపడుతున్నారని కూడా విమర్శించారు.

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ఎంఎంటీఎస్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్

జూబ్లీహిల్స్ బాలికల ట్రాప్ కేసు.. సజ్జనార్ స్పెషల్ ఫోకస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *