Breaking News

బీసీ సమస్యలపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని వీహెచ్ ఆరోపణ

మే 05, (నేటి తెలుగు పత్రిక): కేంద్ర ప్రభుత్వం బీసీ సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు విమర్శించారు.గాంధీ భవన్‌లో మాట్లాడిన ఆయన, బీసీలకు సంబంధించిన అంశాలను కేంద్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 9న ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ప్రకటించారు.బీసీ హక్కుల కోసం అవసరమైతే ప్రాణాలు కూడా పణంగా పెడతానని వీహెచ్ స్పష్టం చేశారు. బీజేపీకి చెందిన బీసీ ఎంపీలు కూడా ఈ విషయంపై స్పందించకపోవడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు.తాజా జనగణనలో బీసీల ప్రస్తావన లేకపోవడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీసీలు ఓటు వేయడం లేదా? వారి సమస్యలు ఎందుకు పట్టించుకోవడం లేదని కేంద్రాన్ని ప్రశ్నించారు.ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాకు లేఖలు రాసినా స్పందన రాలేదని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో కూడా కేంద్రం వైఖరిలో మార్పు లేదని అన్నారు.ఈ నేపథ్యంలో తన నిరసనగా నిరాహార దీక్ష చేపడుతున్నట్లు వీహెచ్ ప్రకటించారు. దీంతో బీసీ అంశం మరోసారి రాజకీయ చర్చకు దారి తీసింది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *