Breaking News

ఒకేరోజు 6 ప్రాంతాల్లో హైడ్రా దాడులు.. అక్రమ యూనిట్లపై కఠిన చర్యలు

మే 05, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో అక్రమ మైనింగ్, క్రషింగ్ యూనిట్లు, ఆర్‌ఎంసీ ప్లాంట్లపై భారీ స్థాయిలో దాడులు నిర్వహించింది. ఒక్క రోజులోనే ఆరు ప్రాంతాల్లో ఆపరేషన్లు చేపట్టి అక్రమ యూనిట్లను కూల్చివేసింది.గండిపేట మండలం వట్టినాగులపల్లి, శేరిలింగంపల్లి పరిధిలోని గౌలిదొడ్డి, శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడ ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. ఈ చర్యల్లో 6 క్రషింగ్ యూనిట్లు తొలగించగా, 12 ఆర్‌ఎంసీ ప్లాంట్లను కూల్చివేశారు.పీసీబీ, మైనింగ్, రెవెన్యూ శాఖల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. సంబంధిత శాఖల సమన్వయంతో కూల్చివేతలు చేపట్టారు.అక్రమ మైనింగ్, క్రషింగ్ యూనిట్లు ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల ఆదాయ నష్టాన్ని కలిగిస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. కొంతమంది ప్రభావశీలుల మద్దతుతో ఈ యూనిట్లు నడుస్తున్నట్లు సమాచారం.ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని, ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

బీసీ సమస్యలపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని వీహెచ్ ఆరోపణ

హైదరాబాద్‌కు అంతర్జాతీయ దిగ్గజం బీఏఎస్‌ఎఫ్: మంత్రి శ్రీధర్ బాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *