సిద్దిపేట, మే 05, (నేటి తెలుగు పత్రిక): ఈటల రాజేందర్ తెలంగాణ అభివృద్ధికి బీజేపీ అధికారంలోకి రావడం ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. గజ్వేల్లో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, ఇప్పుడు చేస్తున్న పనులకు పొంతన లేదని అన్నారు. ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని పేర్కొన్నారు.ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులు ఆలస్యం కావడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, కాంట్రాక్టర్లకు బిల్లులు అందక వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఓటమి దానికి ఉదాహరణ అని చెప్పారు. తమిళనాడులో కూడా ప్రజలు ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం చేశారని తెలిపారు.కుటుంబ రాజకీయాలు, అవినీతి పాలనకు ప్రజలు ముగింపు పలుకుతున్నారని, తెలంగాణలో కూడా అదే పరిస్థితి వస్తుందని ఈటల రాజేందర్ అన్నారు.
